"మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్నిఇస్తాము ". న్యూ ఇండియా పార్టీ



PRESS NOTE
TO,THE EDITOR..
"మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్నిఇస్తాము ".
న్యూ ఇండియా పార్టీ రాబోయే 2019 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ మరియు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో అన్ని స్థానాల్లో పోటి చేయడానికి సన్నిద్ధమయ్యింది. రాబోయే ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్య పద్దతిలో న్యూ ఇండియా పార్టీ తరపున పోటీ చేయబోయే అన్ని స్థానాల పార్టీ అభ్యర్థుల పూర్తి ఖర్చును పార్టీ స్వయంగా భరిస్తుంది .
భారత ప్రజలకు ఆర్ధిక స్వేచ్ఛ కల్పించాలన్నది న్యూ ఇండియా పార్టీ  యొక్క ప్రధాన లక్ష్యం అదే మా ఎజెండా.ఈ అంశాన్ని న్యూ ఇండియా పార్టీ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాము.
 భారత దేశంలో ఆర్ధిక స్వాతంత్య్రం కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్న  శ్రీ భరత్ గాంధీ గారికి మరియు MOVEMENT FOR ECONOMIC FREEDOM జాతీయ అధ్యక్షులు జయ ప్రకాష్ భారత్ గారికి న్యూ ఇండియా పార్టీ లిఖిత పూర్వక  పూర్తి మద్దతు తెలుపుతూ వారి సిద్ధాంతాలను అమలు పరుస్తాము తెలియజేస్తున్నాము.
"మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాము ".భారత దేశ ఓటర్ ప్రజలకు ఆర్ధిక స్వాతంత్య్రం కేవలం న్యూ ఇండియా పార్టీ ద్వారానే సాధ్యం .ప్రియతమా ఓటర్ లారా ఆర్ధిక స్వాతంత్ర్య సాధన కోసం ప్రతి ఒక్కరం న్యూ ఇండియాకు  ఓటు వేద్దాం ,ఓటర్ షిప్ హక్కు ను సాధించు కొందాం.

దేశ సంపదలో ప్రతి VOTER  ని  భాగస్వామ్యం చేద్దాం .
“ నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యాన్ని సాధిద్దాం” .
ప్రతి ఒక్క ఓటరు ఆత్మ గౌరవంతో ,పూర్తి ఆర్ధిక స్వాతంత్ర్య హక్కుతో జీవించాలి .
నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ,ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములుగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు మరియు మూలా స్వాములుగా మా యొక్క న్యూ ఇండియా పార్టీ సిద్ధాంతాన్ని,లక్ష్యాలను ఏర్పాటు చేసాము .మా పార్టీ సిద్ధాంతాలను లక్ష్యాలను కర పత్ర మాద్యం ద్వారా ప్రజలముందుకి తీసుకు వెళ్తున్నాము .
న్యూ ఇండియా పార్టీ యొక్క సిద్ధాంతాలను లక్ష్యాలను ఆదరించే ప్రజలకు ఇదియే మా ఆహ్వానము . ప్రజలకు సేవ చేసే నిజమైన ప్రజాస్వామ్య నాయకులు  ప్రస్తుతమున్న సమాజానికి చాల అత్య అవసరం .
పేదవారు ,యువత, మహిళలు రాజకీయాల్లోకి రావలసిన సమయం ఆసన్న  మయింది .
ప్రస్తుతం రాజకీయాల్లో ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ,ప్రజాస్వామ్యం ఒక అపహాస్యంగా మారింది .సామాన్యుడు రాజకీయాల్లోకి ప్రవేశం లేకుండ చేసారు .
రాజకీయాలు కేవలం వ్యాపారస్తుల చేతిలోకి వెళ్లిపోయాయి. న్యూ ఇండియా పార్టీ ప్రతి సామాన్యునికి,ప్రతి పేదవాడికి ,ప్రతి యువతకు, ప్రతి మహిళకు  ఒక వేదికగా మారనుంది .
ప్రజల్లో మార్పు రాకుండా సమాజంలో,రాజకీయాల్లో ఎటువంటి మార్పు రాదు .కుళ్ళు పట్టిన సమాజాన్ని,రాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికి పిడికిలి బిగించి న్యూ ఇండియా పార్టీ తో కలిసి వచ్చే ప్రతి ఒక్కరికి  ఇదియే మా ప్రజాస్వామ్య ఆహ్వానము .
సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లు : 9100 50 5556
జె వి రాజు ,న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు, ఆర్ధిక స్వాతంత్ర్య ఉద్యమ అధ్యక్షులు జయ ప్రకాష్ భారత్,

Comments

Popular posts from this blog

VOTERSHIP ACT IN PARLIAMENT Representation from Economic Freedom Movement on Political Reforms.

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.