“ నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యాన్ని సాధిద్దాం” .@JPBHARAT



దేశ సంపదలో ప్రతి VOTER  ని  భాగస్వామ్యం చేద్దాం .
“ నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యాన్ని సాధిద్దాం” .
ప్రతి ఒక్క ఓటరు ఆత్మ గౌరవంతో ,పూర్తి ఆర్ధిక స్వాతంత్ర్య హక్కుతో జీవించాలి .
నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ,ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములుగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు మరియు మూలా స్వాములుగా మా యొక్క న్యూ ఇండియా పార్టీ సిద్ధాంతాన్ని,లక్ష్యాలను ఏర్పాటు చేసాము .మా పార్టీ సిద్ధాంతాలను లక్ష్యాలను కర పత్ర మాద్యం ద్వారా ప్రజలముందుకి తీసుకు వెళ్తున్నాము .
న్యూ ఇండియా పార్టీ యొక్క సిద్ధాంతాలను లక్ష్యాలను ఆదరించే ప్రజలకు ఇదియే మా ఆహ్వానము . ప్రజలకు సేవ చేసే నిజమైన ప్రజాస్వామ్య నాయకులు  ప్రస్తుతమున్న సమాజానికి చాల అత్య అవసరం .
పేదవారు ,యువత, మహిళలు రాజకీయాల్లోకి రావలసిన సమయం ఆసన్న  మయింది .
ప్రస్తుతం రాజకీయాల్లో ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ,ప్రజాస్వామ్యం ఒక అపహాస్యంగా మారింది .సామాన్యుడు రాజకీయాల్లోకి ప్రవేశం లేకుండ చేసారు .
రాజకీయాలు కేవలం వ్యాపారస్తుల చేతిలోకి వెళ్లిపోయాయి. న్యూ ఇండియా పార్టీ ప్రతి సామాన్యునికి,ప్రతి పేదవాడికి ,ప్రతి యువతకు, ప్రతి మహిళకు  ఒక వేదికగా మారనుంది .
ప్రజల్లో మార్పు రాకుండా సమాజంలో,రాజకీయాల్లో ఎటువంటి మార్పు రాదు .కుళ్ళు పట్టిన సమాజాన్ని,రాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికి పిడికిలి బిగించి న్యూ ఇండియా పార్టీ తో కలిసి వచ్చే ప్రతి ఒక్కరికి  ఇదియే మా ప్రజాస్వామ్య ఆహ్వానము .
సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లు : 9100 50 5556,9441256545

Comments